Andhra PradeshVisakhapatnam

వాంబే కాలనీ కర్రీ పాయింట్లో గ్యాస్ సిలెండరు లీక్ అయ్యి అగ్ని ప్రమాదం.

వాంబే కాలనీ కర్రీ పాయింట్లో గ్యాస్ సిలెండరు లీక్ అయ్యి అగ్ని ప్రమాదం.

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి :- మధురవాడ, వాంబే కాలనీ లో గ్యాస్ సిలిండర్ పేలుడు జరిగి అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొత్తగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కడుతున్నారు. గవర్నమెంట్ ఆస్పత్రి పక్కన ఉన్న కర్రీ పాయింట్ బడ్డీ లో కొత్త గ్యాస్ సిలెండరు తగిలిస్తుండగా పైప్ లీక్ అయ్యి ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం లో ఆస్తి నష్టం జరిగింది ఎటువంటి ప్రాణ నష్టం జరగక పోవటంతో ఊపిరి పీల్చుకున్నామని స్థానికులు తెలిపారు. యజమాని కనకమ్మ, బడ్డీ లో మామిడాల శ్రీను వంట మాస్టర్, తండ్రి పిచ్చియ్య, ఇంటి నెంబర్ 7బి /ఎస్ . ఫ్ 10 లో నివసిస్తున్నారు మామిడాల శ్రీను వంట చేస్తుండగా కొత్త సిలెండరు కు పైప్ తగిలిస్తుండగా పైప్ లీక్ అయ్యి ప్రమాదం సంభవించింది అని వంట మాస్టర్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో చుట్టుపక్కల వున్న స్థానికులు వచ్చి ఇసుక మూటలతో ఇసుకను తీసుకువచ్చి చాలా చాక చక్యంగా మంటలు వ్యాప్తి చెందకుండా నిలుపుదలచేశారన్నారు. , టీడీపీ 7వ వార్డు నాయకులు పిళ్ళా వెంకటరావు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలను తెలుసుకున్నారు. పి. ఎమ్ పాలెం పోలీసులు మోహన్ సంఘటన వివరాలను తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!