Andhra PradeshChittoor

తిరుపతి, తిరుమలలో కురస్తున్న వర్షాలకు ఘాట్‌ రోడ్డులో మళ్లీ విరిగిపడ్డ కొండ చరియలు…ఘాట్ రోడ్ తాత్కాలిత మూసివేత !

తిరుపతి, తిరుమలలో కురస్తున్న వర్షాలకు ఘాట్‌ రోడ్డులో మళ్లీ విరిగిపడ్డ కొండ చరియలు…ఘాట్ రోడ్ తాత్కాలిత మూసివేత !

క్యాపిటల్ వాయిస్, తిరుపతి :- తిరుపతి, తిరుమలలో కురస్తున్న వర్షాలకు ఘాట్‌ రోడ్డులో మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డు మీద పడడంతో రహదారి కోతకు గురైంది. పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డు మీద పడడంతో రహదారి కోతకు గురైంది. రెండో ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద భారీగా చీలికలు ఏర్పడ్డాయి. భాష్యకార్ల సన్నిధికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. టీటీడీ అత్యవసర సిబ్బంది చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీలైనంతవరకు త్వరగా రహదారికి మరమ్మతులు నిర్వహించి భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తున్నారు. కాగా ఇటీవల తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. రెండు ఘాట్‌ రోడ్లలో చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో కూడా తిరుమలకు రాకపోకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తిరుపతిని వర్షాలు చుట్టుముట్టాయి . ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పోయాయి. ఈ వర్షాల కారణంగా తిరుమల లో రూ. 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!