Andhra PradeshKurnool

తండ్రి బ్రతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందిన ఘరానా పుత్రులు !?

తండ్రి బ్రతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందిన ఘరానా పుత్రులు !?

క్యాపిటల్ వాయిస్, కర్నూలు జిల్లా :- కర్నూలు జిల్లాలో బతికున్న తండ్రిని చంపేశారు కొడుకులు. తండ్రి బతికున్నా.. చనిపోయాడంటూ ఓ మరణ ధ్రువపత్రాన్ని సృష్టించి ఆస్తిని దక్కించుకోవాలని ప్లాన్ చేశారు. కుమారుల అక్రమ వ్యవహారం ఆలస్యంగా బయటపడింది. బాధితుడు తిమ్మయ్య చెబుతున్న వివరాల ప్రకారం. అవుకు మండలం వేములపాడుకు చెందిన తిమ్మయ్యకు ఇద్దరు భార్యలు.. మెదటి భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. నంద్యాలలో నివాసం ఉంటున్నాడు. అవుకు మండలం వేములపాడులో ఆయనకు 5.36 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.మొదటి భార్య ముగ్గరు కుమారులు ఈ భూమిపై కన్నేశారని, తాను మరణించినట్లుగా ధ్రువపత్రం సంపాదించారన్నారు. అవుకు సబ్‌-రిజిస్టార్‌ కార్యాలయంలో ఆస్తి రిజిస్టర్ చేయించుకున్నారని ఆరోపించారు. తన పొలం తనఖా పెట్టి బ్యాంకు రుణం పొందుతున్నానని.. ఈసీ తీయడంతో అసలు విషయం బయటపడిందన్నారు. ఆస్తికి సంబంధించి తన పేరుకు బదులు కుమారుల పేర్లు వచ్చాయని చెప్పుకొచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!