Andhra PradeshKurnool
శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్కి నీటి మట్టం…. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటాపోటీగా కరెంట్ ఉత్పత్తి చేయడమే కారణమా !?

శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్కి నీటి మట్టం…. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటాపోటీగా కరెంట్ ఉత్పత్తి చేయడమే కారణమా !?
క్యాపిటల్ వాయిస్, శ్రీశైలం :- రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధానమైన శ్రీశైలం జలాశయం ఇప్పుడు డెడ్ స్టోరేజీకి చేరుకుంది. 215 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 35 టీఎంసీల డెడ్ స్టోరేజీ స్థాయికి నిల్వలు పడిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐదు నెలల కిందట 856.10 అడుగుల నీటి మట్టంతో 94.91 టీఎంసీల నిల్వలు ఉండగా.. ప్రస్తుతం 35 టీఎంసీల డెడ్ స్టోరేజీకి చేరుకుంది. అయితే శ్రీశైలంలో తాగు, సాగునీటి అవసరాలను కొనసాగిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేయాలంటూ ఇటీవల తెలుగు రాష్ట్రాలను హెచ్చరిస్తూ కేఆర్ఎంబీ లేఖలు రాసింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచనలను పక్కన పెట్టి పోటీపోటీగా విద్యుత్ ఉత్పత్తి చేయడమే ఈ రోజు డెడ్ స్టోరేజీ పరిస్థితి దారి తీశాయని నిపుణులు చెబుతున్నారు.రానున్న వేసవిలో నీటిమట్టం మరింత తగ్గనుండటంతో ఇరు రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. సాగు, తాగు నీటి అవసరాలకు కూడా మరింత ఇక్కట్లు పడే అవకాశం కనిపిస్తోంది. 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం కేవలం 35 టీఎంసీల నీరు ఉండటంతో ఇరు రాష్ట్రాల అధికారులు కొంత మేర ఆందోళన చెందుతున్నారు.