Andhra PradeshNellore

పేదల పెన్షన్ల రద్దు… జగన్ పేదలకిచ్చిన రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కానుకా ?

పేదల పెన్షన్ల రద్దు… జగన్ పేదలకిచ్చిన రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కానుకా ?

క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు :- రాష్ట్రంలో భారీ స్థాయిలో 2లక్షల 30 వేల మంది పేదల పెంషన్లను అనేక కుంటి సాకులు చూపించి జగన్ ప్రభుత్వం తొలగించింది. వీటన్నిటిని రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కానుకగా తొలగించారా అని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ మాట్లాడుతూ  కరంట్ బిల్ పెరిగితే రేషన్ కార్డ్ రద్దు, పెంషన్ రద్దు ఇంటిపన్ను పెరిగితే కార్డ్ రద్దు, పెంషన్ రద్దు,  వేలిముద్ర పడకపోతే 90 ఏళ్ల వృద్ధులకు సైతం పెంషన్ రద్దు ఒంటరి మహిళకు  ఎం ఆర్ ఓ ధ్రువీకరణ, వితంతు పెన్షన్లలో భర్త డెత్ సర్టిఫికెట్ సమర్పించినప్పటికి పొరపాటున రేషన్ కార్డులో భర్త పేరు తొలగించకుండా ఇంకా ఉంటే నిర్ధ్యాక్షణ్యంగా పెన్షన్ తొలగించేశారన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం 2 లక్షల 30 వేల మంది పెన్షన్ రద్దు చేసింది. నెల్లూరు జిల్లాలో 16 వేల మందికి, నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో దాదాపు 2 వేల మందికి పెంషన్లు తొలగించారన్నారు.. ఎన్నికల ముందు 60 సంవత్సరాలు దాటిన వారందరికీ పెన్షన్లను ఇస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కుంటి సాకులు చూపించి లక్షల పెన్షన్లను తొలగిస్తున్నారన్నారు.తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు వలన 3 నెలలు పెన్షన్ తీసుకోలేకపోయినా ఒకేసారి తీసుకొనే వీలుండేది. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏ నెలకు ఆ నెలే అని నిబంధన పెట్టి పెన్షన్ల మిగిలించుకొని పేదలకు అన్యాయం చేస్తోందన్నారు.దరఖాస్తు చేసిన వెంటనే పెంషన్ ఇస్తామని చెప్పిన వైసిపి ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో దరఖాస్తు పెట్టుకున్న వారికి కూడా ఇప్పటికి ఇవ్వలేదన్నారు.చంద్రబాబు నాయుడు రెండు వందల పెంషన్ రెండు వేల చేస్తే జగన్ నేను అధికారంలోకి వస్తే మూడు వేలు ఇస్తానని చెప్పి రెండున్నర సంవత్సరాలు పూర్తిఅవుతున్నా కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచారన్నారు.. డూప్లికేట్ జాబ్ కేలండర్ తో నిరుద్యోగులను మభ్యపెడుతున్న జగన్ వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ఏ ఇతర అలవెన్సులు లేకుండా కేవలం పదిహేను వేలు జీతం ఇస్తూ వారికి లక్షలు జీతాలు ఇస్తున్నట్టు వారి కుటుంబ సభ్యులకు కూడా  రేషన్ కార్డులు పెంషన్లు తొలగించేశారన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పిట్టి సత్యనాగేశ్వరరావు, మామిడాల మధు, జహీర్, నాయకులు ఆకుల హనుమంతరావు, పసుపులేటి మల్లికార్జున రావు, సుభాన్ బాషా, హాజరత్ అలీ, వేణు,శశి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!