AMARAVATHIAndhra Pradesh

పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడి.. మంగళగిరిలో టి డి పి కేంద్ర కార్యాలయం పై కూడా

పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడి.. మంగళగిరిలో  టి డి పి కేంద్ర కార్యాలయం పై కూడా

క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం ముదురుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకి పోలీసులు నోటీసులు ఇవ్వడంపై పట్టాభిరామ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ విలేకర్ల సమావేశంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేశారు.సుమారు 200 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పట్టాభి ఇంటిపై దాడి చేశారు. ఇంటి ముందు ఉన్న కారు, పూల కుండీలు, కుర్చీలు ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తాన్ని పగలగొట్టారని పట్టాభి కుటుంబసభ్యులు తెలిపారు. పట్టాభిని చంపేస్తామంటూ బెదిరించారని.. దీంతో ఇంట్లో పిల్లలు బాత్రూమ్ దాక్కొన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఫస్ట్ ఫ్లోర్‌లోని కంప్యూటర్లు కూడా పగలగొట్టినట్లు సమాచారం. పట్టాభి ఇంటితో పాటు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడి చేశారు.స్థానిక టీడీపీ నేతలు దీనిపై మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు గంట ముందు వచ్చి పట్టాభి ఇంట్లో ఉన్నారా లేరా అని ఆరా తీశారని.. పట్టాభి ఇంట్లో లేని సమయంలో 30 మంది మహిళలు, 20 మంది యువకులు కర్రలతో దాడి చేశారని చెబుతున్నారు. వైసీపీ చేస్తున్న చర్యలతో టీడీపీ ఇంకా బలపడుతుందని వారు పేర్కొంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!