నల్లమల ఘాట్ రోడ్ లో తెలంగాణ భక్తుల బస్సు బోల్తా – 10 మందికి తీవ్ర గాయాలు

నల్లమల ఘాట్ రోడ్ లో తెలంగాణ భక్తుల బస్సు బోల్తా – 10 మందికి తీవ్ర గాయాలు
క్యాపిటల్ వాయిస్, శ్రీశైలం :- నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లమల ఘాట్ రోడ్డులో మలుపు దగ్గర బస్సు బోల్తా పడింది. తెలంగాణ లోని కొత్తగూడెం నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి
వెళ్తుండగా.. శ్రీశైల శిఖరానికి 5 కిలోమీటర్ల సమీపం లోని నల్లమల ఘాట్ రోడ్డు చిన్నారుట్ల దెయ్యాల మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కొత్తగూడెం నుంచి శ్రీశైలం బస్సు లో వస్తున్నారు. శిఖరం సమీపంలో ఘాట్ రోడ్డులో మలుపు దగ్గర బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని 108 వాహనంలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మలుపును డ్రైవర్ అంచనా వేయలేకపోవడం తో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 10
మందికి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే వారిని 108 వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. పలువురికి కాళ్లు, చేతులు విరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది బస్సులో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘాట్ రోడ్డు లో మలుపులను బస్సు డ్రైవర్ సరిగ్గా అంచనా వేయలేకపోయినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో బస్సు కూడా వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో లోయఉంది.. ఒకవేళ అందులో పడి ఉండి ఉంటే పరిస్థితి ఏంటని అంటున్నారు. బస్సు
రోడ్డు పక్కన సేఫ్టీ వాల్ను ఢీకొట్టి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.