AMARAVATHIAndhra Pradesh

లోకేశ్ జూమ్ మీటింగ్ లో కొడాలి నాని వల్లభనేని వంశీ.

లోకేశ్ జూమ్ మీటింగ్ లో కొడాలి నాని వల్లభనేని వంశీ.

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

అమరావతి: టెన్త్‌ విద్యార్థులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్వహించిన జూమ్‌ సమావేశంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.వైకాపాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జూమ్‌ మీటింగ్‌లో ప్రత్యక్షమయ్యారు.దీన్ని గమనించిన లోకేశ్‌.. సమావేశంలో ఆ పార్టీ నేతలు ఉన్నా ఫర్వాలేదని, వైకాపా ప్రభుత్వం ఎలా ఏడ్చిందో వారికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. విద్యార్థులను ఫెయిల్‌ చేయడం ప్రభుత్వం చేతగానితనమని.. జూమ్‌లో దొంగ ఐడీలతో సమావేశాన్ని డిస్టర్బ్‌ చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆ సమావేశం నుంచి ఎమ్మెల్యే వంశీ తప్పుకున్నారు. కార్తిక్‌ కృష్ణ అనే విద్యార్థి పేరుతో కొడాలి నాని పాల్గొన్నారు. ప్రభుత్వ చేతగానితనాన్ని ఎండగడతానంటూ లోకేశ్‌ ఆ సమావేశాన్ని కొనసాగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!