హెడ్ కానిస్టేబుల్ నాలుగు పెళ్లిళ్లు…. మరో పెళ్లికి సిద్ధమైన కానిస్టేబుల్…!?

హెడ్ కానిస్టేబుల్ నాలుగు పెళ్లిళ్లు…. మరో పెళ్లికి సిద్ధమైన కానిస్టేబుల్…!?
క్యాపిటల్ వాయిస్, విశాఖ జిల్లా ప్రతినిధి :- విశాఖపట్నంలో సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న అప్పలరాజుపై మహిళ చేతన సంచలన వ్యాఖ్యలు చేసింది. కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఇప్పటికి నలుగురు మహిళలను పెళ్లిచేసుకున్నాడని ఆరోపించారు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుని ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడని.. వీరిలో పద్మ అనే మహిళకు నాలుగు సార్లు అబార్షన్ కూడా చేయించాడన్నారు. అప్పలరాజు మరో మహిళ కానిస్టేబుల్తో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన పద్మ అప్పలరాజును నిలదీసింది. కానిస్టేబుల్ అప్పలరాజుపై దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. పోలీసులతో పాటు మహిళ చేతన స్వచ్చంధ సంస్థ కూడా స్పందించింది. సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు బండారం బయటపెట్టి, మోసపోయిన మహిళాలకు అండగా ఉంటామని మహిళ చేతన చైర్పర్సన్ కత్తి పద్మ అన్నారు. కానిస్టేబుల్ను విధుల నుంచి తొలగించి అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.