National

కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి…. పూర్తిస్థాయి అధ్యక్షురాలు తానేనని సోనియా గాంధీ స్పష్టం !

కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి…. పూర్తిస్థాయి అధ్యక్షురాలు తానేనని సోనియా గాంధీ స్పష్టం!

క్యాపిటల్ వాయిస్, జాతీయం :- కాంగ్రెస్ అత్యున్నత కమిటీ సీడబ్ల్యూసీ ఇవాళ సమావేశం అయ్యింది. ఈ సమావేశం ప్రారంభ ఉపన్యాసం లో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, ఐక్యంగా ఉండి, పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తే రానున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిపై తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్కంఠకు తెర దించుతూ పూర్తిస్థాయి అధ్యక్షురాలు తానేనని సోనియా గాంధీ స్పష్టం చేశారు. పార్టీలో సమర్థమైన నాయకత్వం లేదని అసమ్మతి తెలియజేస్తున్న జీ-23 నేతల విమర్శలకు ఆమె చెక్ పెట్టారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక, లఖింపూర్ ఘటన, వచ్చే ఏడాది రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు తదితర అంశాలు ఎజెండాగా శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో సోనియా గాంధీ దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై మాట్లాడారు.

సీనియర్ల రచ్చ సరికాదు…

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ ప్రారంభ ఉపన్యాసంలో సోనియా గాంధీ పలు సంకేతాలు, సూచనలు చేశారు. సోనియా గాంధీ అధ్యక్షతన దిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో జరుగుతోన్న సమావేశంలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. సంస్థాగత ఎన్నికలు డిమాండ్ చేస్తూ సోనియాకు లేఖ రాసిన సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. సీనియర్ల రచ్చపై సోనియా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. సీనియర్లు కొందరు సంస్థాగత ఎన్నికల విషయమై బయట వేరే విధంగా మాట్లాడుతున్నారన్నారు. సీడబ్ల్యూసీ భేటీ పై మీడియాతో మరో రకంగా మాట్లాడం సరికాదని సోనిమా గాంధీ అన్నారు. పార్టీ పదవులకు ఎన్నిక అనివార్యమన్న విషయం తనకు తెలుసన్న ఆమె… 2019 నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగానే ఉంటున్నానన్నారు. ఇకపై కాంగ్రెస్ పార్టీకి ఫుల్ టైమ్ అధ్యక్షురాలిగా తానే ఉంటానని సోనియా స్పష్టం చేశారు.  పార్టీ నేతలు తమ అభిప్రాయాలను చెప్పవచ్చని కానీ మీడియా ద్వారా తెలియజేయాల్సిన అవసరం లేదని సోనియా అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించే సందర్భం వచ్చిందన్నారు. లఖింపూర్ ఖేరీలో జరిగిన ఘటనపై సీడబ్ల్యూసీ సమావేశంలో విచారం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనలపై బీజేపీ ఆలోచనకు లఖింపూర్ ఘటన నిదర్శనమన్నారు. విదేశాంగ విధానం, సరిహద్దుల్లో పరిస్థితులపైనా సోనియా ఆందోళన వ్యక్తంచేశారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!