Andhra PradeshVisakhapatnam

భీమిలి, మధురవాడ ప్రాంతాలలో గుట్టుగా గుట్కా వ్యాపారాలు.

భీమిలి, మధురవాడ ప్రాంతాలలో గుట్టుగా గుట్కా వ్యాపారాలు.

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :మధురవాడ ప్రతినిధి

మధురవాడ ప్రాంతాల లో గుట్టుగా సాగుతున్న గుట్కా వ్యాపారంపై పోలీసులు దృష్టి సారించడం లేదు. మధురవాడ లో విచ్చలవిడిగా గుట్కా రవాణా సాగుతోంది. పోలీసులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు దాడులు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఒరిస్సా నుంచి పెద్ద మొత్తంలో గుట్కా బస్తాలు జిల్లాల్లోని ఆయా ప్రాంతాలకు చేరి.. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్లు సమాచారం. గతంలో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు లేనందునే..వారు మరింతగా బరితెగించి గుట్కా దందా సాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మధురవాడ కి, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గుట్కా సంచులు తెప్పించి.. ప్రతి దుకాణానికి తరలిస్తున్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో సరుకు నిల్వ చేసి గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించేవారు. ఆ తరువాత ఒరిస్సా నుంచి. ప్రస్తుతం ప్రాంతాల నుంచి సరఫరా జరుగుతోంది. కొందరు డిస్ట్రిబ్యూటర్ల ముసుగులో నిషేధిత జర్దా పాన్ మసాలా తెప్పిస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ద్విచక్రవాహనాలు, కూరగాయల ఆటోలు, పార్శిల్ వాహనాల ద్వారా ఇతర ప్రాంతాలకు పంపుతున్నారు. జిల్లా సరిహద్దు జిల్లాలుగా ఉన్న రిటైల్ వ్యాపారులకు కూడా ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నట్లు సమాచారం.

గుట్కా వ్యాపారాన్ని ఇటు హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.

నిషేధిత గుట్కా వ్యాపారాన్ని కొంతమంది మరింత సీరియస్ గా తీసుకొని ప్రతి నెలా లక్షలాది రూపాయలను గడిస్తున్నారు. పోలీసులు అరెస్టు చేస్తే వారం తిరక్కుండానే కమీషన్లు ఇచ్చో, లేక పెనాల్టీ లు కట్టి వచ్చేస్తామనే ధీమాతో తమ దందాను కొనసాగిస్తున్నారు. ఈ వ్యాపారాన్ని గతంలో ఎవరైతే నిర్వహించేవారో ఇప్పటికీ వారే నడుపుతున్నారు. పోలీ చైన్ సిస్టంలో ఈ గుట్కా దందా నడుస్తోంది. జిల్లాలో సుమారు రూ.3 కోట్లకు పైగానే వ్యాపారం జరుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.గుట్కా నమిలేవారి అభిరుచి ఆధారంగా సుమారు 10 పేర్లతో సాధారణ గుట్కా, పాన్ మసాలా గుట్కా (రెండు ప్యాకెట్లను కలిపి తింటారు)తయారు చేస్తారు.
చిరు వ్యాపారులపైనే చర్యలు..!గుట్కా అక్రమ వ్యాపారం పై సంబంధిత అధికారులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు జరుపుతున్న దాడుల్లో చిరు వ్యాపారులు మాత్రమే పట్టు బడుతున్నారు. బడా వ్యాపారులు చిక్కడం లేదనే ఆరోపణలున్నాయి. బడా వ్యాపారుల నుండి ప్రతీ నెల పరితోషకాలు అందుతున్నాయని అందువల్లే వారిని చూసి చూడనట్టు వదిలేస్తారని చిరు వ్యాపారులు అంటుంటారు.ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా పెద్ద మోతాదులో గుట్కాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నప్పటికీ గుట్కా వ్యాపారులు తమ పద్దతులను మార్చుకోవడం లేదు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి తాఖీదులు, హుకుం జారీ చేస్తే నామ మాత్రంగా దుకాణాలు తనిఖీలు నిర్వహించి గుట్కాలు, ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వ్యాపారులను వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి. అసలు సరుకు ఎక్కడి నుండి వస్తుందో దానిపై నిఘా పెడితే అసలు వారిని పట్టుకుంటే సరఫరాని నిరోదిస్తే వ్యాపారాన్ని నిరోదించేవారవుతారనే సామాన్య ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!