AMARAVATHIAndhra Pradesh

ఏపీలో పెన్షన్ పోర్టబులిటీ.. ఇక నుంచి ఎక్కడైనా పెన్షన్ తీసుకోవచ్చు

ఏపీలో పెన్షన్ పోర్టబులిటీ.. ఇక నుంచి ఎక్కడైనా పెన్షన్ తీసుకోవచ్చు

క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  వైఎస్ఆర్ పెన్షన్ కానుక  లబ్ధిదారులను శుభవార్త చెప్పింది. స్వగ్రామాలకు దూరంగా ఉంటూ పెన్షన్ సాయాన్ని కోల్పోతున్నవారికి మంచి అవకాశాన్ని కల్పించింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులను శుభవార్త చెప్పింది. స్వగ్రామాలకు దూరంగా ఉంటూ పెన్షన్ సాయాన్ని కోల్పోతున్నవారికి మంచి అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది మంది లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది.గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేస్తున్నారు. నెలనెలా దాదాపు 95శాతం మందికి పెన్షన్లు ఇంటివద్దే అందుతున్నాయి. వేలిముద్రలు పడకపోవడం, లబ్ధిదారులు ఇళ్లవద్ద లేకపోవడంతో అలాంటి వారికి మాత్రం సాయం అందడం లేదు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ మాదిరిగానే పెన్షన్ కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ఆదేశాలు జారీ చేసింది.వ్యక్తిగత, కుటుంబ, ఆరోగ్య కారణాల వల్ల స్వగ్రామాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఈ అవకాశం వర్తించనుంది. ఆరు నెలల పాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నట్లు వారు ధృవీకరించాల్సి ఉంటంది. అలాగే లబ్ధిదారులు నివాసముంటున్న గ్రామ/వార్డు వాలంటీర్ ద్వారా గ్రామ/వార్డు సచివాలయానికి లబ్ధిదారులను మ్యాపింగ్ చేస్తామని అధికారులు తెలిపారు.పెన్షన్ పోర్టబిలిటీకి సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలని సెర్ప్ సీఈఓ.. డీఆర్డీఏ ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని కార్యాలయాలకు ఆదేశాలను జారీ చేశారు. త్వరలోనే పెన్షన్ పోర్టబిలిటీ ప్రారంభం కానుంది.రాష్ట్రంలో అర్హులైన వారందరికీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అందాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. ప్రాంతాలు మారిన వారు వెంటనే సంబంధిచ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం వృద్ధ్యాప్య, వితంతు, దివ్యాంగులు, డయాలసిస్ పేషెంట్లు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు ఇస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులు తమ పిల్లల దగ్గరో, బంధువుల దగ్గరో ఉండటంతో వారికి ప్రతి నెల పెన్షన్ ఇవ్వడం కష్టంగా మారింది.ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లబ్ధిదారులు ఏనెలైనా పెన్షన్ తీసుకోకుంటే.. ఆ తర్వాతి నెలలో రెండూ కలిపి ఇచ్చే వెసులుబాటును తొలగించింది. లబ్ధిదారులంతా నెలనెలా కచ్చితంగా పెన్షన్ తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!