75 పిస్తా పప్పులపై అద్భుతమైన సూక్ష్మ కళ….నెల్లూరు జిల్లా యువతి ప్రపంచ రికార్డ్

75 పిస్తా పప్పులపై అద్భుతమైన సూక్ష్మ కళ….నెల్లూరు జిల్లా యువతి ప్రపంచ రికార్డ్
నెల్లూరు జిల్లా యువతి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. భారత 75వ ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకుని 75 పిస్తా పప్పులపై 75 మంది స్వాతంత్య్ర ఉద్యమకారులు, 75 పిస్తా పప్పులపై మన దేశ సంప్రదాయ సంస్కృతి సంబంధించిన చిత్రాలు చిత్రీకరించి మెరాకిల్స్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. మైక్రో ఆర్ట్ విభాగంలో కీర్తన వరల్డ్ రికార్డు క్రియేట్ చేసినట్లు ప్రకటిస్తూ.. మెరాకిల్స్ సంస్థ వారు ధ్రువీకరణ పత్రము, బంగారు పథకం పంపించారు. వీటిని నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు శనివారం కీర్తనకు అందజేశారు. ఆమె వేసిన చిత్రాలను చూసి కలెక్టర్ అభినందించారు. తన విద్యార్థి కీర్తన వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం సంతోషంగా ఉందని ప్రముఖ చిత్రకారుడు, కీర్తన గురువు షేక్ అమీర్జాన్ అన్నారు. అమీర్ అకాడమీలో కీర్తన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.