వై ఎస్ ఆర్ రొండో విడత ఆసరా పథకం కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు.

వై ఎస్ ఆర్ రొండో విడత ఆసరా పథకం కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడతలో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి *ముత్తంశెట్టి శ్రీనివాసరావు* భీమిలీ నియోజకవర్గంలో మధురవాడ వాంబే కాలనీలో ఆదివారం మధ్యాహ్నం 7వ వార్డు, లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలకు చేయూతనిస్తున్నాయని అన్నారు. *కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.* గత ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధి మరచిందని అన్నారు. హామీలిచ్చి నెరవేర్చని ప్రభుత్వంగా మిగిలిపోతే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే అనేక పథకాలు అమలు చేసిందని అన్నారు. గ్రామీణ పేదిరిక నిర్మూలనలో భాగంగా మెప్మా, సెర్ప్ ద్వారా డ్వాక్రా గ్రూపు సభ్యులైన మహిళల అకౌంట్లలో నేరుగా జమ చేస్తారని అన్నారు.
*ఈ పథకం ద్వారా ఇచ్చే డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు తమ అభివృద్ధిలో భాగంగా ఉపయోగించుకోవాలని మంత్రి అన్నారు.* మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దిశ చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. కేంద్రం చట్టం చేయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా.. ఈ చట్టం ద్వారా మిగిలిన రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వం చిత్తశుద్ధితో . స్వచ్ఛమైన పాలన ద్వారా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని సీఎం జగన్ కాంక్షిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా 5,6,7 వార్డులకు సంబంధించి 992 స్వయం సహాయక సంఘాలకు చెందిన 10127మంది సభ్యులకు రూ.12,05,86,541చెక్కును మంత్రి సభ్యులకు అందించారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ హరి వెంకట కుమారి, రాష్ట్ర నగరాలు కార్పొరేషన్ చైర్పర్సన్ పిళ్ళా సుజాత సత్యనారాయణ జోనల్ కమీషనర్లు రాము, వెంకటరమణ, నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి ముత్తంశెట్టి మహేశ్, 5,వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత ,7 వ వార్డు కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ, వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.