ఉద్యోగ ధర్మాన్ని మరచి రాజకీయ నాయకుల కు పనిచేస్తున్న పోలీసులు.కౌంటింగ్ ఏజెంట్ తమ్మిన నర్సింగ్ రావు..
ఉద్యోగ ధర్మాన్ని మరచి రాజకీయ నాయకుల కు పనిచేస్తున్న పోలీసులు.కౌంటింగ్ ఏజెంట్ తమ్మిన నర్సింగ్ రావు..
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం మండలంలో తమ్మిన చిన్నమ్ములు,మీడియా సమావేశంలో మాట్లాడుతూ జరిగిన ఎంపీటీసీ, ZPTC ఎన్నికల ఫలితాలో వైస్సార్సీపీ అధికార దుర్వినియోగం చేసింది.ప్రభుత్వ అధికారులు కూడ అధికార పార్టీ కి తొత్తులు గా పనిచేస్తున్నారు. నేను ప్రత్యక్షంగా చూసాను. ఇటువంటి చేతకాని గెలుపు కూడా ఒక గెలుపేనా ఇలానే ఉంటె కురుక్షేత్ర సంగ్రామం లో దుర్యోధునికి పట్టిన గతే అధికార పార్టీ కి పడుతుంది.ప్రజాస్వామ్యం లో అధికారులు నిస్పక్షపాతం గా పనిచేసినప్పుడు మాత్రమే సమాజం బాగుపడుతోంది.
అధికారులు సిగ్గులేకుండా అధికార పార్టీ కి తొత్తులు గా బ్రతుకుతున్నారు.ప్రభుత్వ అధికారులు నీతి నిజాయితీ కోసం మారండి మీకన్నా రోడ్డు మీద భిక్షమెత్తుకొని బ్రతికేవాళ్లు చాలా గొప్పవాళ్ళు అని అన్నారు. తమ్మిన చిన్నమ్ములు పై రౌతు శ్యామల వైసీపీ అభ్యర్థి 18 ఓట్ల మెజార్టీతో గెలుపుపొందారు అని ప్రకటించటం కనీసం అభ్యర్థి సంతకం కూడా తీకోలేదని అదేంటి అని అడిగితే దిక్కున్నోడికి చెప్పుకో అన్నారని తమ్మిన చిన్నమ్మలు తెలిపారు . అధికార పార్టీ కి పోలీసులు కూడా సపోర్ట్ చేయడం చాలా సిగ్గు చేటు కలిగిస్తుంది.
ఆనందపురం మండలంలో పోతిన మల్లయ్యపాలెం CI రవి కుమార్ అధికార పార్టీ నాయకులకుకొమ్ము కాస్తున్నారని
జనసేన అభ్యర్థి తమ్మిన చిన్నమ్ములు, కౌంటింగ్ ఏజెంట్ తమ్మిన నర్సింగ్ రావు తెలిపారు..